పాదయాత్ర కమిటీతో బండి సమావేశం

ABN , First Publish Date - 2022-04-07T01:50:58+05:30 IST

బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో ఆ పార్టీ

పాదయాత్ర కమిటీతో బండి సమావేశం

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం అయ్యారు. సమావేశానికి డీకే అరుణ, యాత్ర కమిటీ  ఇంఛార్జ్ మనోహరరెడ్డి తదితరులు  హాజరయ్యారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా  రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర  ప్రారంభం కానున్నది. నియంతృత్వం, కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగిన మెదటవిడత పాదయాత్ర సాగినట్లు బండి తెలిపారు. అందులో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడతున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత పాదయాత్రను  కమలనాథులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేసవికాలం కావటంతో పాదయాత్రకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-07T01:50:58+05:30 IST