బండి సంజయ్‌, భోడిగ శోభకు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-01-07T21:06:14+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ అరెస్ట్ కేసులో రిమాండ్ ఆర్డర్‌పై

బండి సంజయ్‌, భోడిగ శోభకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: బీజేపీ నేత బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ అరెస్ట్ కేసులో రిమాండ్ ఆర్డర్‌పై హైకోర్టులో భోడిగ శోభ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. రూ.25 వేలతోపాటు ఒక షూరిటీని కరీంనగర్ సెషన్స్ కోర్టులో సమర్పించి బెయిల్ పొందాలని హైకోర్టు పేర్కొంది. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన కేసులో బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాపర్తి ప్రసాద్‌, ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌పై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం  కలిగించడంపై  బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2022-01-07T21:06:14+05:30 IST