అలాగైతే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరు: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-08-14T18:26:24+05:30 IST
అలాగైతే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరు: బండి సంజయ్
యాదాద్రి: బీజేపీ ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పారిపోయాయని విమర్శించారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీదన్నారు. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను ఎప్పుడూ విమర్శించలేదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టచ్లో ఉన్నారని తానెప్పుడూ చెప్పలేదన్నారు. వెంకట్రెడ్డి మంచి పొలిటికల్ లీడర్ అని కొనియాడారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే, రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తోందన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.