బీజేపీ కార్యకర్తల అరెస్ట్పై బండి సంజయ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-04T02:44:41+05:30 IST
బీజేపీ కార్యకర్తల అరెస్ట్పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో అరెస్ట్ చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: బీజేపీ కార్యకర్తల అరెస్ట్పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో అరెస్ట్ చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బాలికపై గ్యాంగ్రేప్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. హోంమంత్రి మనవడిపై ఆరోపణలున్నాయని తెలిపారు. దోషులెవరో ప్రభుత్వం, పోలీసులకు తెలుసన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ విమర్శించారు.