Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితం: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-07-30T23:29:27+05:30 IST
ఎవరు ఎక్కడ నుంచి పోటీచేయాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.
హైదరాబాద్: ఎవరు ఎక్కడ నుంచి పోటీచేయాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే సంప్రదాయం బీజేపీ (BJP)లో లేదని ప్రకటించారు. ఉపఎన్నిక రావాలని టీఆర్ఎస్ (TRS).. రాకూడదని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు. ఉపఎన్నికపై ప్రజల అభిప్రాయానికే బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారని ఆరోపించారు. కాళేశ్వరం లోపాలపై త్వరలో వివేక్ అధ్వర్యంలో ఢిల్లీకి బృందం వెళ్తుందని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర జలశక్తిమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలపారు. ప్రజలు వరదలతో ఇబ్బందుల్లో ఉంటే.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ విహారయాత్రలా? అని ప్రశ్నించారు. పాతబస్తీపై కేంద్రహోం మంత్రి అమిత్ షా (Amit Shah) దృష్టి పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు.