అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారు: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-04-14T00:23:19+05:30 IST
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని బీజేపీ నేత బండి సంజయ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని బీజేపీ నేత బండి సంజయ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్కు ప్రభుత్వం వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసిందని, అయినా నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 2012 డిసెంబర్లో హిందువులను ఉద్దేశించి నిజామాబాద్, నిర్మల్లో అక్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్పై నమోదయిన రెండు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసులు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు వద్దని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది.