Bandi Sanjay: రాజగోపాలరెడ్డితో పాటు అనేక మంది బీజేపీలోకి వస్తారు..

ABN , First Publish Date - 2022-07-27T21:32:53+05:30 IST

బీజేపీలోకి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికను బండి సంజయ్ దృవీకరించారు.

Bandi Sanjay: రాజగోపాలరెడ్డితో పాటు అనేక మంది బీజేపీలోకి వస్తారు..

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP)లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చేరికను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) దృవీకరించారు. బుధవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది బీజేపీలోకి వస్తారని స్పష్టం చేశారు. త్వరలో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (TRS MLAs) కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, సరైన సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) నాయకులు బీజేపీ కండువా కప్పుకుంటారన్నారు. చేరికలపై తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని, హైకమాండ్‌కు మాత్రమే తాము జవాబుదారీ అని,  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి విషయంలో ఈడీ (ED) తన పని తాను చేసుకుపోతోందని, ఈడీని బీజేపీ కంట్రోల్ చేస్తోందనేది ప్రతిపక్షాల ప్రచారం మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. 

Updated Date - 2022-07-27T21:32:53+05:30 IST