Modi నిర్ణయాలతో అంబేద్కర్ సంతృప్తి చెందుతారు: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-06-24T18:10:53+05:30 IST

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ(PM Modi), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

Modi నిర్ణయాలతో అంబేద్కర్ సంతృప్తి చెందుతారు: Bandi Sanjay

Hyderabad : రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ(PM Modi), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ధన్యవాదాలు తెలిపారు. తల్లిగా దేశానికి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సేవ చేస్తారని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని అంబేద్కర్‌ వారసుడితో బండి‌ సంజయ్ పోల్చడం గమనార్హం. మోదీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్‌(Ambedkar) తృప్తి చెందుతారని పేర్కొన్నారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోదీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గానికి చెందిన కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ కొనియాడారు. 

Updated Date - 2022-06-24T18:10:53+05:30 IST