KCR, KTR ఫ్లెక్సీల ప్రకటనలు BJP సభను ఆపలేకపోయాయి: Bandi Sanjay
ABN , First Publish Date - 2022-07-05T22:03:41+05:30 IST
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీల ప్రకటనలు బీజేపీ సభను ఆపలేకపోయాయని బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR) ఫ్లెక్సీల ప్రకటనలు బీజేపీ (BJP) సభను ఆపలేకపోయాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కార్యకర్తలు, అభిమానులు, జనం స్వచ్చంధంగా బహిరంగ సభకు తరలి వచ్చారని అన్నారు. మంగళవారం బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ చీప్ ట్రిక్స్ను ప్రజలు గమనించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అర్వింద్, రఘునందన్రావు, గరికపాటి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.