సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

ABN , First Publish Date - 2022-05-01T00:17:03+05:30 IST

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ రాశారు.వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని లేఖలో డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు.వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిగింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు కావస్తోందన్నారు.ప్రభుత్వ ప్రకటన కేవలం ప్రగల్భాలేనని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా.. కేవలం 2,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలే ప్రారంభించారని మండిపడ్డారు. రైతుల పట్ల రాష్ట్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందన్నారు.ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని సంజయ్‌ చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం అలసత్వాన్ని వీడి.. ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.బియ్యం పూర్తిగా తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిగింజను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-05-01T00:17:03+05:30 IST