kcrపై విరుచుకుపడ్డ బండి సంజయ్

ABN , First Publish Date - 2022-05-16T02:08:19+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణను ఒక మూర్కుడు పాలిస్తున్నాడని

kcrపై విరుచుకుపడ్డ బండి సంజయ్

ఖమ్మం(తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణను ఒక మూర్కుడు పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో  కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బండి సంజయ్ ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. పువ్వాడ అజయ్ వేధింపులతోనే సాయి గణేష్ చనిపోయాడని ఆరోపించారు. సాయి గణేష్‌ది ఆత్మహత్య కాదని, టీఆర్ఎస్  హత్యగా అభివర్ణించారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలాన్ని అధికారులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తన దుర్మార్గాలను కప్పిపుచ్చుకునేందుకు పువ్వాడ అజయ్ కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడని, ఈ విషయాన్ని కమ్మ కులస్థులు గమనించాలన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ తొంభై శాతం తన ఫాం హౌస్‌లో గడిపారని ఆరోపించారు. 

Updated Date - 2022-05-16T02:08:19+05:30 IST