Bandi Sanjay: ముగిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
ABN , First Publish Date - 2022-08-27T20:43:31+05:30 IST
బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. మూడో ఫేజ్ పాదయాత్రలో సంజయ్
వరంగల్: బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. మూడో ఫేజ్ పాదయాత్రలో సంజయ్ 300 కిలో మీటర్లు నడిచారు. 5 జిల్లాలు, 1 1నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ (Hanmakonda) లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. జనగామ (Jangaon) జిల్లా పాంనూర్ వద్ద బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. ఈ క్రమంలోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు.