సైకోలా మారిన కేటీఆర్‌: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-05-19T01:39:30+05:30 IST

మంత్రి కేటీఆర్‌ సైకోలాగా మారాడని, దేశ ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

సైకోలా మారిన కేటీఆర్‌: Bandi Sanjay

వేములవాడ: మంత్రి కేటీఆర్‌ సైకోలాగా మారాడని, దేశ ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బుధవారం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్‌ ప్రవర్తన వల్ల ’సన్‌’స్ట్రోక్‌ తప్పదని జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు బతుకుదెరువు కరువయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి వివరిస్తూ.. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-05-19T01:39:30+05:30 IST