డీజీపీ, సీపీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-25T23:58:14+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి చేసిన దాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

డీజీపీ, సీపీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు: బండి సంజయ్

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి చేసిన దాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా? లేక గూండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా...? అని ఘాటుగా ప్రశ్నించారు. యువమోర్చా కార్యకర్తపై కత్తులతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, హోం గార్డును బదిలీ చేసే అధికారం కూడా డీజీపీకీ లేదా? అని ప్రశ్నించారు. సీపీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని,  సీఎం కేసీఆర్ అలాంటి వాతావరణం సృష్టించారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-25T23:58:14+05:30 IST