బండి సంజయ్ జూటా మాటలు మానాలి: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-04-23T21:54:00+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్ జూటా మాటలు మానాలని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి ఎక్కువే ఇచ్చిందని సంజయ్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని

బండి సంజయ్ జూటా మాటలు మానాలి: హరీష్‌రావు

హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్ జూటా మాటలు మానాలని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి ఎక్కువే ఇచ్చిందని సంజయ్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణ రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో ఇచ్చిందని తెలిపారు. కానీ కేంద్రం ఇచ్చింది రూ.1,68,647 కోట్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.7,183 కోట్లు ఇవ్వడం లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-23T21:54:00+05:30 IST