Pada yatra.. జనగామ: పాలకుర్తి మండలంలో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-16T17:49:27+05:30 IST

బండి సంజయ్ జనగామ, పాలకుర్తి మండలం, విస్నూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు.

Pada yatra.. జనగామ: పాలకుర్తి మండలంలో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

జనగామ (Janagama): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మంగళవారం పాలకుర్తి మండలం, విస్నూర్ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama yatra) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, స్థానిక నేతలు పాల్గొన్నారు. విస్నూర్, లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి, కడవెండి వరకూ పాదయాత్ర  సాగనుంది. ఈరోజుతో బండి సంజయ్ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోనున్నారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో పాదయాత్ర రూట్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-08-16T17:49:27+05:30 IST