విద్వేషాలు రెచ్చగొట్టడానికే Bandi Sanjay పాదయాత్ర: సబిత
ABN , First Publish Date - 2022-05-14T00:02:00+05:30 IST
విద్వేషాలు రెచ్చగొట్టడానికే బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: విద్వేషాలు రెచ్చగొట్టడానికే బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకునే కేంద్రమంత్రి అమిత్షా రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో నీటివాటా ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని రేపు అమిత్షా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ, ఐఐఎస్సిఆర్, ఎన్ఐటి, ఐఐఎం, నవోదయ, మెడికల్ కాలేజీలు.. ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పడానికే అమిత్షా వస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్ చేశారు.