ప్రజలారా వరి కావాలా... ఉరి కావాలా?: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-10-28T00:25:10+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాష్‌ను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

ప్రజలారా వరి కావాలా... ఉరి కావాలా?: బండి సంజయ్‌

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాష్‌ను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని సర్వేలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తేల్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఫేక్‌ లెటర్లు సృష్టిస్తూ నమస్తే తెలంగాణ బూతు పేపర్‌లో రాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పేపర్‌ టిష్యూ పేపర్‌ కన్నా అధ్వానమైనదని ఎద్దేవాచేశారు. హుజూరాబాద్‌ ప్రజలారా వరి కావాలా..? ఉరి కావాలా..? వరి కావాలంటే బీజేపీకి.. ఉరి కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సంజయ్ కోరారు. 

Updated Date - 2021-10-28T00:25:10+05:30 IST