TS News: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-31T01:46:43+05:30 IST

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు.

TS News: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వరదల్లో ప్రజలు నష్టపోతే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. చికోటి చీకటి కోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులున్నారని ఆరోపించారు. చికోటి వెనుక ఉన్న చీకటి మిత్రులు ఎవరో తేలాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చికోటి వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరపాలన్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఈ హవాలా జరుగుతోందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)కి తెలంగాణలో పాదయాత్ర చేసే హక్కు లేదని చెప్పారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)తో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-31T01:46:43+05:30 IST