TS News: ఆగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

ABN , First Publish Date - 2022-07-23T02:06:00+05:30 IST

బీజేపీ(bjp) తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్(bandi sanjay) మూడో విడత పాదయాత్ర(padayatra)పై బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.

TS News: ఆగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

హైదరాబాద్(Hyderabad): బీజేపీ(bjp) తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్(bandi sanjay) మూడో విడత పాదయాత్ర(padayatra)పై బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఆగస్ట్ 2 నుంచి మూడోవిడత పాదయాత్ర ఉంటుందని పార్టీలోని ముఖ్యనేతలు తెలిపారు. యాదగిరిగుట్ట(Yadagirigutta) నుంచి వరంగల్(Warangal) భద్రకాళి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.ఆగస్ట్ 2వ తేదీన యాదగిరిగుట్టలో బహిరంగ సభకు బీజేపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్యనేతలను పిలవాలని నిర్ణయం తీసుకుంది.పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై ఢిల్లీ(Delhi) నుంచి వర్చువల్‌గా బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh), కరీంనగర్ నుంచి బండిసంజయ్ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-23T02:06:00+05:30 IST