తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-04-06T19:38:27+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీ ఆవిర్భావదినం సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచారని, నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలవద్దకు పోతామని, గడప గడపకు వెళతామని ప్రజలకు వాస్తవ విషయాలను వివరిస్తామని, ప్రజలను చైతన్నవంతులను చేస్తామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత, అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిత్యం పోరాడుతూ చావుకు కూడా వెనుకాడని నైజం బీజేపీ కార్యకర్తలదని అన్నారు. అధికారం కోసం కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. ప్రధాని మోదీ, నడ్డా సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళుతోందని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2022-04-06T19:38:27+05:30 IST