కందులు, శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-26T05:39:02+05:30 IST
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ వైఎం.సరిత ప్రారంభించారు.
కనిగిరి, ఫిబ్రవరి 25: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ వైఎం.సరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాల ద్వారా రైతు ఆర్థిక పురోగతి చెందాలని కోరారు. ప్రభుత్వం క్వింటా కందులకు రూ. 6 వేలు. క్వింటా శనగలకు రూ. 5100కు కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు తమ వద్ద ఉన్న శనగలను, కందులను మార్కెట్ యార్డుకు తరలించి లబ్ధి పొందాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రైతులందరూ తమ పంట వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రర్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మేనేజర్, ఏడీఏ రమణ, వైసీపీ నాయకులు వైఎం ప్రసాద్రెడ్డి, సూరసాని మోహన్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.