తాళికట్టే వేళ...

ABN , First Publish Date - 2022-05-23T18:34:37+05:30 IST

మరికొన్ని క్షణాలలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగానే వధువు హంగామా చేసింది. పెళ్లిపీటలపై చేరి సంప్రదాయాలన్నీ

తాళికట్టే వేళ...

ప్రియుడితో పెళ్లి చేయాలని వధువు హంగామా 

బెంగళూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): మరికొన్ని క్షణాలలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగానే వధువు హంగామా చేసింది. పెళ్లిపీటలపై చేరి సంప్రదాయాలన్నీ ముగించాక వరుడు చేతికి తాళి తీసుకోగా ఒక్కసారిగా పెళ్ళికుమార్తె సినిమా తరహాలో నాటకమాడారు. మైసూరులోని విద్యాభారతి కల్యాణమండపంలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా. హెచ్‌డీ కోటె తాలూకాకు చెందిన ఓ యువకుడితో మైసూరుకు చెందిన యువతి వివా హానికి ఇరుకుటుంబాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి రిసెప్షన్‌ సాగగా ఉద యం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తాళి కట్టేందుకు వరుడు సిద్ధం కాగా పెళ్ళి కుమార్తె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెకు అనారోగ్యం ఉంటుందని బంధువులు భావించారు. కాసేపటి తర్వాత ఆమె నాటకమాడుతున్నట్టు తేలింది. నాకు ఈ పె ళ్లి వద్దని, ప్రియుడితో పెళ్లి చేయించాలని పట్టుబట్టింది. బంధువులు కాసేపే నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత సేపటికీ ప్రియుడి వెంటే వెడతానని తేల్చి చె ప్పింది. వరుడి కుటుంబీకులు, వధువు తల్లిదండ్రులతోపాటు బంధువులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. పట్టుచీరకు లక్ష రూపాయలు ఖర్చు చేశామని ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడెందుకు మా మర్యాద తీశారంటూ మండిపడ్డారు. చివరకు కేఆర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా వీరి నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుడికే నేరుగా వధువు మెసేజ్‌ ద్వారా పెళ్లి ఇష్టం లేదని సమాచారం పంపింది. అప్పుడే అప్రమత్తమైన వరుడి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ చేశారు. సదరు మెసేజ్‌తో నాకు సంబంధం లేదని, పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేయగా చివరిక్షణంలో పెళ్లి వద్దంటూ నిరా కరించడంతో గందరగోళానికి దారితీసింది.  

Updated Date - 2022-05-23T18:34:37+05:30 IST