బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపండి

ABN , First Publish Date - 2021-03-09T05:45:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపండి
ర్యాలీ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు

బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

నెల్లూరు(హరనాథపురం), మార్చి 8 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఏపీ ప్రధాన కార్యదర్శి వీ ఉదయకుమార్‌ ఆధ్వర్యంలో దర్గామిట్ట నుంచి మాగుంట విగ్రహం వరకు ఈ నిరసన ప్రదర్శన సాగింది. ఉదయకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించటం వల్ల అనేక గ్రామీణప్రాంత శాఖలను మూసివేయవలసి వస్తుందన్నారు. దీంతో సామాన్య ఖాతాదారులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ అనంతరం నాయకులు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మృదుల, సుమన్‌, బాషా, కిరణ్‌, రామకృష్ణ, ఆనందరాంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T05:45:20+05:30 IST