ఈమె చేసిన పని ఏమిటో తెలిస్తే...
ABN , First Publish Date - 2022-06-02T14:01:33+05:30 IST
నకిలీ పత్రాలు సమర్పించి రూ.97 లక్షల మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్ను క్రైం విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అరియూర్కు చెందిన ఉమామహేశ్వరి
- పనిచేసేచోటే కన్నం !
- నకిలీ పత్రాలతో రూ.97 లక్షల మోసం
- బ్యాంక్ మేనేజర్ అరెస్టు
వేలూరు(చెన్నై), జూన్ 1: నకిలీ పత్రాలు సమర్పించి రూ.97 లక్షల మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్ను క్రైం విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అరియూర్కు చెందిన ఉమామహేశ్వరి (38) వేలూరు కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో గుడియాత్తం శాఖ మేనేజర్ ఉన్న సమయంలో ఆమె నకిలీ పత్రాలతో మహిళా స్వయం సహాయక బృందాల పేరిట రూ.97.37 లక్షల మేర రుణాలు మంజూరు చేసి అవినీతికి పాల్పడినట్లు బ్యాంక్ అధికారుల పరిశీలనలో తెలిసింది. దీనిపై కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పరంజ్యోతి ఫిర్యాదు మేరకు జిల్లా వర్తక క్రైం విభాగం పోలీసులు విచారణ జరిపి, మేనేజర్ అవినీతికి పాల్పడి ఆ నగదుతో చెన్నై, వేలూరు, కాట్పాడి ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి వేలూరు మహిళా కారాగారానికి తరలించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది.