Bankలో చోరీ: రూ.7 లక్షలు, రూ.2 కోట్ల విలువచేసే బంగారు నగల అపహరణ

ABN , First Publish Date - 2022-07-05T00:43:18+05:30 IST

నిజామాబాద్: బస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చోరీ జరిగింది. రూ.7 లక్షలు, రూ.2 కోట్ల విలువచేసే బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. బ్యాంకు లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్

Bankలో చోరీ:  రూ.7 లక్షలు, రూ.2 కోట్ల విలువచేసే బంగారు నగల అపహరణ

నిజామాబాద్: బస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చోరీ జరిగింది. రూ.7 లక్షలు, రూ.2 కోట్ల విలువచేసే బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. బ్యాంకు లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్తో లాకర్‌ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్ల వాడకం వల్ల రూ. 7.30 లక్షల విలువ చేసే కరెన్సీ నోట్లు కాలిపోయాయి. 3.50 కోట్ల విలువ గల 8 కిలోల పైచిలుకు బంగారం అపహరణకు గురైంది. చోరీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సీపీ నాగరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.  

Updated Date - 2022-07-05T00:43:18+05:30 IST