బ్యాంకు సిబ్బంది ఘరానా మోసం?
ABN , First Publish Date - 2021-08-31T00:21:41+05:30 IST
మహిళా సంఘలకు మంజూరైన రుణాన్ని బ్యాంకు సిబ్బంది స్వాహ చేసిన
కృష్ణా: మహిళా సంఘాలకు మంజూరైన రుణాన్ని బ్యాంకు సిబ్బంది స్వాహ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోపిదేవి మండలంలోని అన్నవరం గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంకులో జరిగిన మోసం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 7 గ్రూపుల పేరుతో వచ్చిన 70 లక్షల రుణాన్ని యూనియన్ బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. జూలై నెలలో రుణం మంజూరయితే ఆ మొత్తాలను బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.