తీరంలో కార్తీక స్నానాలకు ఏర్పాటు
ABN , First Publish Date - 2020-11-30T05:00:01+05:30 IST
కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తుల కోసం సూర్యలంక తీరంలో అధికారులు ఏర్పాటు చేశారు.
బాపట్లరూరల్, నవంబరు 29: కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తుల కోసం సూర్యలంక తీరంలో అధికారులు ఏర్పాటు చేశారు. సోమవారం భక్తులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. మెడికల్ క్యాంప్తో పాటు మహిళలు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు తీరం వెంబడి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. సూర్యలంక సముద్రతీరానికి వచ్చే పర్యాటకులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని రూరల్ సీఐ కె.శ్రీనివాసరెడ్డి కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత చర్యలు చేపడుతున్నామని తెలిపారు తీరం వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో బందోబస్తును కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.