Delhi: జడ్జీల పదవీవిరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-15T16:51:18+05:30 IST

న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Delhi: జడ్జీల పదవీవిరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

ఢిల్లీ (Delhi): న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council of India) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు (High Court) న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లకు పెంచాలని.. తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానం చేసింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. వయో పరిమితి పెంపు  తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు ఇతర ఫోరమ్‌లకు చైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంటుకు ప్రతిపాదించాలని తీర్మానం చేసింది. తీర్మానంపై తక్షణ చర్య కోసం తీర్మానం కాపీని ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

Updated Date - 2022-09-15T16:51:18+05:30 IST