బార్బర్ జీవితాన్ని మార్చివేసిన ఐపీఎల్ మ్యాచ్... రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు...

ABN , First Publish Date - 2021-09-30T14:22:29+05:30 IST

మనదేశానికి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని...

బార్బర్ జీవితాన్ని మార్చివేసిన ఐపీఎల్ మ్యాచ్... రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు...

మనదేశానికి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లంతా తహతహలాడిపోతుంటారు. దీనికి కారణం ఈ లీగ్‌లో పాల్గొనే క్రీడాకారులకు అత్యధిక మొత్తంలో సొమ్ము చేతికి అందడంతో పాటు అమితమైన పేరుప్రఖ్యాతులు వస్తాయి. ఇదేవిధంగా కొందరు క్రికెటర్లకు ఈ మ్యాచ్‌ల కారణంగా స్థిరమైన కెరియర్ ఏర్పడుతుంది. అయితే దీనికి భిన్నంగా ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా ఊహించని రీతిలో ఒక బార్బర్ జీవితం పూర్తిగా మారిపోయింది. 


బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన ఒక బార్బర్ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ కాంపిటీషన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. బార్బర్ అశోక్ కుమార్... చెన్నై సూపర్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక టీమ్ ఎంపిక చేశాడు. అతని అంచనా ప్రకారం చెన్నై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ పూర్తయిన తరువాత ఈ కాంపిటీషన్‌లో అశోక్‌ను విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అనంతరం నేను ఈ పోటీలో తొలి స్థానంలో నిలిచాను. దీంతో కోటి రూపాయలు గెలుచుకున్నాను. కొద్దిసేపటి తరువాత అధికారికంగా ఈ విషయమై నాకు ఫోన్ వచ్చింది. రెండు రోజుల తర్వాత నా ఖాతాలోకి రూ. 70 లక్షల వస్తాయని తెలిపారు.


ట్యాక్స్‌ల అనంతరం బహుమతి మొత్తం అందుతుందన్నారు. ఈ ఆనందంలో ఆరోజు రాత్రి నేను నిద్రపోలేదు’ అని తెలిపారు. అశోక్... బధుబని జిల్లాలోని నానౌర్ చౌకీ వద్ద సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. అతను చాలా ఏళ్లుగా డ్రీమ్ టీమ్ పోటీలో పాల్గొంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అతనికి తొలిసారిగా జాక్‌పాట్ తగిలింది. కాగా ఈ బహుమతి మొత్తంతో తనకున్న అప్పులన్నింటినీ తీర్చివేస్తానని, తరువాత ఇంటిని నిర్మించుకుంటానని తెలిపారు.

Updated Date - 2021-09-30T14:22:29+05:30 IST