పంతులు పిలక కట్... క్షురకునిపై కేసు నమోదు!
ABN , First Publish Date - 2021-08-11T13:17:21+05:30 IST
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో గల ఒక సెలూన్కు...
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో గల ఒక సెలూన్కు కటింగ్ కోసం వచ్చిన పంతులు శివానంద్ కోట్నాలాకు అక్కడి క్షురకుడు (బార్బర్) హెయిర్ కటింగ్ చేయడంతో పాటు, పిలకను కూడా తొలగించాడు. శివానంద్ ఇంటికి వెళ్లిన తరువాత.., బార్బర్ తన పిలకను కూడా కట్ చేశాడని గుర్తించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సదరు బార్బర్పై నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీనికిముందు శివానంద్ బార్బర్ షాపునకు వెళ్లి తన పిలక కట్ చేసిన బార్బర్తో గొడవకు దిగారు. ఈ సమయంలో బార్బర్... పంతులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అనంతరం శివానంద్ ఆ బార్బర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.