శ్మశాన భూమి ఆక్రమణపై దళితుల ఆందోళన
ABN , First Publish Date - 2021-06-22T04:59:26+05:30 IST
దళితులకు చెందిన శ్మశానభూమి ఆక్రమణను నిరసిస్తూ సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేశారు.
కాళ్ళ, జూన్ 21 : దళితులకు చెందిన శ్మశానభూమి ఆక్రమణను నిరసిస్తూ సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేశారు. కాళ్ళలో తమ పూర్వీకుల నుంచి ఉన్న 15 సెంట్లు శ్మశాన భూమిని సరిహద్దు రైతు అండదండలతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దార్, పోలీస్ స్టేషన్, వీఆర్వోలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. గతంలో 45 సెంట్లు విస్తీర్ణం ఉన్న చెరువును ఆక్రమించుకున్నారన్నారు. అధికారులు స్పందించి శ్మశాన భూమికి రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి కృపాదానం, సరేళ్ల వినోద్కుమార్, విపర్తి విజయ్భాస్కర్, తాళ్లూరి మాణిక్యాలరావు, ఉచ్చుల జార్జి, కటారి పృధ్వీ, తాళ్లూరి రాజ్కుమార్ పాల్గొన్నారు.