Bars Auction: ఏపీలో నేడు రెండో రోజు బార్ల ఈ వేలం

ABN , First Publish Date - 2022-07-31T13:06:09+05:30 IST

ఏపీ (AP)లో రెండో రోజు ఆదివారం బార్ల ఈ వేలం (Bars Auction) జరగనుంది.

Bars Auction: ఏపీలో నేడు రెండో రోజు బార్ల ఈ వేలం

అమరావతి (Amaravathi): ఏపీ (AP)లో రెండో రోజు ఆదివారం బార్ల ఈ వేలం (Bars Auction) జరగనుంది. ఈ రోజు కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ వేలం జరుగుతుంది. కోస్తాలో ఇప్పటికే ఎమ్మెల్యేల అనుచరుల దందా కొనసాగుతోంది. తమను కాదని బార్లు పెడితే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. 


కాగా ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు శనివారం బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ (RayalaSeema), ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్ల (Bars)కు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం రూ.258 కోట్ల ఆదాయం వచ్చింది. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించారు. 

Updated Date - 2022-07-31T13:06:09+05:30 IST