వ్యాక్సిన్ కోసం బారులు
ABN , First Publish Date - 2021-05-11T04:50:55+05:30 IST
వ్యాక్సిన్ కోసం బారులు
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రి వద్ద కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం వచ్చిన వారితో రద్దీగా మారింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ప్రభుత్వాసుపత్రి వద్దకు వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. దీంతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా వృద్దులు గంటల తరబడి ఆసుపత్రి వద్ద వేచిచూడలేక నానా అవస్థలకు గురయ్యారు. నగరంలో ఏ కేంద్రంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు చూపించకపోవడంతో అక్కడి ప్రజలు నగరశివారులోని ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కోసం వచ్చే వారితో ప్రభుత్వాసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.