Basaraలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తాగునీరు నిలిపివేత

ABN , First Publish Date - 2022-06-16T17:47:38+05:30 IST

బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేశారు.

Basaraలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తాగునీరు నిలిపివేత

నిర్మల్: బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విధంగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది...తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్దరించాలి’’ అని విద్యార్థులు ట్వీట్ చేశారు. మరోవైపు బాసర ఆర్జీయూకేటి( ట్రిపుల్ ఐటి) మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు గేటు వైపు దూసుకురాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. 12 డిమాండ్లతో గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-16T17:47:38+05:30 IST