Basaraలో మళ్లీ యుద్ధ వాతావరణం

ABN , First Publish Date - 2022-06-17T14:40:32+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

Basaraలో మళ్లీ యుద్ధ వాతావరణం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) వద్ద మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. వేలాదిమంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు బాసర క్యాంపస్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులను అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తాము బయటకు కనిపించకుండా  బారికేడ్లు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండో గేట్ వద్ద కూడా భారీగా ‌పోలీసులు మోహరించారు. అడుగు అడుగునా  పోలీసులు అంక్షలు అమలు చేస్తున్నారు. నిజామాబాద్-భైంసా రూట్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2022-06-17T14:40:32+05:30 IST