Basara ఆర్జీయూకేటీ - ట్రిబుల్ ఐటీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-15T19:15:56+05:30 IST

బాసర ఆర్జీయూకేటీ - ట్రిబుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.

Basara ఆర్జీయూకేటీ - ట్రిబుల్ ఐటీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిర్మల్: బాసర ఆర్జీయూకేటీ - ట్రిబుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా విపక్ష నేతలు, తల్లిదండ్రులు గేటు బయట ఆందోళనకు దిగారు. బాసరకు వచ్చే రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇతరులెవరూ రాకుండా నిజామాబాద్ - భైంసా రూట్లలో పికెటింగ్‌లు ఏర్పాటు  చేశారు. బాసర రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.


Updated Date - 2022-06-15T19:15:56+05:30 IST