Basara Triple IT వివాదానికి చెక్ పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-06-20T16:53:56+05:30 IST
గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ(Basara Triple IT)లో నడుస్తున్న వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.
నిర్మల్ : గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ(Basara Triple IT)లో నడుస్తున్న వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం కసరత్తు ప్రారంభించింది. అలాగే వైస్ ఛాన్స్లర్(VC) నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసే అవకాశం ఉంది. విద్యార్థులకు వెంటనే యూనిఫామ్లు(Uniforms) ఇవ్వాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులతో భేటి తర్వాత హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ప్రకటన జారీ చేయనున్నారు.