Basra Triple ITలో సద్దుమణగని విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-17T12:38:09+05:30 IST
బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల ఆందోళన సద్దుమణగలేదు.
Nirmal: బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల ఆందోళన సద్దుమణగలేదు. నాలుగో రోజూ శుక్రవారం కూడా నిరసనలకు సిద్దమవుతున్నారు. డిమాండ్ల విషయంలో విద్యార్థులు (Students) పట్టువీడడంలేదు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో క్యాంపస్ గేటు వద్ద పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నేతలెవరూ రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్-భైంసా రహదారుల్లో పికెటింగ్లు ఏర్పాటు చేశారు.