గజ్వేల్‌ పట్టణంలోని హాస్టల్‌ భవనంలో బస్తీ దవాఖానా

ABN , First Publish Date - 2022-07-01T05:42:42+05:30 IST

గజ్వేల్‌ పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద గల హాస్టల్‌ భవనంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలోని పాత హాస్టల్‌ భవనాన్ని గురువారం ఆయన డీఎంహెచ్‌వో జూలూరి కాశీనాథ్‌తో కలసి పరిశీలించారు.

గజ్వేల్‌ పట్టణంలోని హాస్టల్‌ భవనంలో బస్తీ దవాఖానా


భవనాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌


గజ్వేల్‌, జూన్‌ 30: గజ్వేల్‌ పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద గల హాస్టల్‌ భవనంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలోని పాత హాస్టల్‌ భవనాన్ని గురువారం ఆయన డీఎంహెచ్‌వో జూలూరి కాశీనాథ్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అదనపు కలెక్టర్‌ అధికారులకు వివరించారు. ఆయనవెంట గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ.రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కమిషనర్‌ విద్యాధర్‌, నాయకులు మామిడి శ్రీధర్‌, పీఆర్‌ ఈఈ నాగేందర్‌, డీఈఈ అజయ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-07-01T05:42:42+05:30 IST