శ్రీవారికి రెండు బ్యాటరీ కార్ల బహూకరణ
ABN , First Publish Date - 2022-08-18T07:02:09+05:30 IST
శ్రీవారి ఆలయానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యా ర్థం రూ.16 లక్షల విలువైన 14 సీటర్ల రెండు బ్యాటరీ కార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించింది.
ద్వారకా తిరుమల, ఆగస్టు 17 : శ్రీవారి ఆలయానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యా ర్థం రూ.16 లక్షల విలువైన 14 సీటర్ల రెండు బ్యాటరీ కార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించింది. ఇప్పటికే ఆలయంలో దాతలు ఇచ్చిన బ్యాటరీ కార్లున్నా, కొత్త కార్లతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. ఆలయానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులను ఈ వాహనాల ద్వారా జంట గోపు రాల వద్ద నుంచి ఆలయ తూర్పు గోపురం వరకు తీసుకెళ్లనున్నారు. ఆ వాహనాలను ఎస్బీఐ రీజనల్ మేనేజర్(ఏలూరు) టీవీఎన్బీ రాజు, ఆలయ చైర్మన్ రాజా ఎస్వి సుఽధాకరరావు. ఈవో వేండ్ర త్రినాధరావు ప్రారంభించారు. అనంతరం వాటిని అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృత రావు, ఆర్ఎం రాజు జెండా ఊపి ట్రైల్ రన్ నిర్వహించారు.