టీఆర్ఎస్, బీజేపీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి: భట్టి
ABN , First Publish Date - 2021-03-06T20:52:46+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి: భట్టి
ఖమ్మం: రేపటి నుంచి సైకిల్పై భట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా భట్టి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. భట్టితో కలిసి సైకిల్ యాత్రలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. ఐటీఐఆర్ను బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు గాలికొదిలేశాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలన్నారు.