చివరి టెస్టుకు బ్యాటింగ్ పిచ్!
ABN , First Publish Date - 2021-02-28T09:36:49+05:30 IST
భారత్-ఇంగ్లండ్ డే/నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో మొతేరా పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది...
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ డే/నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో మొతేరా పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండు జట్ల మధ్య వచ్చేనెల 4 నుంచి మొతేరాలోనే జరిగే నాలుగో, ఆఖరి టెస్టుకు పక్కా బ్యాటింగ్ వికెట్ రూపొందించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలిసింది. కాగా..మూడో టెస్టు పిచ్పై విమర్శలు వచ్చినా..బీసీసీఐపై ఎలాంటి చర్యలూ తీసుకొనేందుకు ఐసీసీ సుముఖంగా లేదని సమాచారం.