బీబీఎంపీ చీఫ్ కమిషనర్గా తుషార్ గిరినాథ్
ABN , First Publish Date - 2022-05-06T17:00:31+05:30 IST
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపి) చీఫ్ కమిషనర్ గౌరవ్గుప్తాను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను మౌలిక అభివృద్ధి శాఖ అదనపు ము
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపి) చీఫ్ కమిషనర్ గౌరవ్గుప్తాను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను మౌలిక అభివృద్ధి శాఖ అదనపు ము ఖ్యకార్యదర్శిగా నియమించారు. కాగా గుప్తా స్ధానంలో బీబీఎంపీ చీఫ్ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి తుషార్ గిరినాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు ఈ కొత్త పో స్టింగ్ ఇవ్వడం విశేషం. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నూతన చీఫ్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా గౌరవ్గుప్తా బదిలీకి సంబంధించి ఊహాగానాలు వినిపిస్తుండటం తెలిసిందే.