ఎమ్మెల్సీ స్థానం బీసీలకు కేటాయించాలి
ABN , First Publish Date - 2021-01-25T03:05:27+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్కుమార్
వనపర్తి టౌన్, జనవరి 24: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఆదివారం బీసీల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జనాభాలో 52శాతం ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు వాడుకుంటున్నాయని విమర్శించారు. గుంటి కురుమూర్తి, బాలరాజు నాయుడు, సాయికృష్ణగౌడ్, యు గంధర్, గోకం మధు, కార్తీక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.