ఎమ్మెల్సీ స్థానం బీసీలకు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-01-25T03:05:27+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ స్థానం బీసీలకు కేటాయించాలి
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌

   బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ 

వనపర్తి టౌన్‌, జనవరి 24:  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో ఆదివారం బీసీల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు  ఎప్పుడు వచ్చిన జనాభాలో 52శాతం ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు వాడుకుంటున్నాయని విమర్శించారు.    గుంటి కురుమూర్తి, బాలరాజు నాయుడు, సాయికృష్ణగౌడ్‌, యు గంధర్‌, గోకం మధు, కార్తీక్‌      కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T03:05:27+05:30 IST