బుగ్గన క్షపూరితమైన రాజకీయాలను మానుకోవాలి: బీసీ జనార్దన్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-12T18:46:27+05:30 IST
పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
నంద్యాల: పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డోన్ నియోజకవర్గంలో జరిగే మైనింగ్ దందాను ఆర్థికమంత్రి బుగ్గన అరికట్టాలని డిమాండ్ చేశారు. క్షపూరితమైన రాజకీయాలను బుగ్గన మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో విసనకర్రలు కొవ్వొత్తులు లాంతర్లకు డిమాండ్ పెరిగిందని బీసీ జనార్దన్రెడ్డి ఎద్దేవా చేశారు.