బీసీ జనగణన తక్షణమే చేపట్టాలి
ABN , First Publish Date - 2021-07-25T08:42:39+05:30 IST
బీసీ జనగణనను తక్షణమే చే పట్టాలని తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర ఏ కులాలకు జనగణన చేపట్టబోమని కేంద్ర ప్రభుత్వం చేసిన...
- బీసీ సంఘాల డిమాండ్.. జంతర్ మంతర్లో నిరసన
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బీసీ జనగణనను తక్షణమే చే పట్టాలని తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర ఏ కులాలకు జనగణన చేపట్టబోమని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు శంకర్ రావు సహా ప లువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్రం చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే.. లక్షలాది మంది బీసీలతో పార్లమెంటును ముట్ట డిస్తామని వారు హెచ్చరించారు.