ఈటలపై వేధింపులు తగదు: బీసీ సంఘం

ABN , First Publish Date - 2021-05-11T04:49:39+05:30 IST

బీసీ నేత ఈటల రాజేందర్‌పై రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదని కల్లూరు మండల బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు లింగబోయిన పుల్లారావు ఆక్షేపించారు.

ఈటలపై  వేధింపులు తగదు: బీసీ సంఘం
మాట్లాడుతున్న పుల్లారావు

కల్లూరు, మే 10: బీసీ నేత ఈటల రాజేందర్‌పై రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదని కల్లూరు మండల బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు లింగబోయిన పుల్లారావు ఆక్షేపించారు. ఈటలపై జరుగుతున్న వేధింపులను బీసీ సమాజం నిశితంగా గమనిస్తుందన్నారు. కక్షసాధింపు చర్యలు ప్రభుత్వం ఆపకపోతే ధర్మాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీసంఘం గౌరవ సలహాదారులు బొడ్డు అప్పయ్య, బొడ్డు కృష్ణ, గుండ్ల శ్రీను, రామనర్సింహారావు, వెంకటాచారి, దార్ల నర్సింహారావు, సురేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:49:39+05:30 IST