ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో పోరాడే భారత జట్టు ఇదే!
ABN , First Publish Date - 2021-06-16T00:35:01+05:30 IST
న్యూజిలాండ్తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారా, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారికి జట్టులో స్థానం లభించింది. గాయం కారణంగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో ఆడలేకపోయిన ఆల్ రౌండర్ రవీందర్ జడేజా తిగిరి జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.