`సినిమాల్లోనే అనుకున్నా.. బయట కూడా ఇలా ఆడుకుంటారా..` అంటూ ఓ యువతి చేసిన పని ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-18T20:32:15+05:30 IST

ఆ 20 ఏళ్ల యువతి తన చెల్లితో కలిసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.. బుధవారం సాయంత్రం కొద్ది సేపు చదువుకున్న తర్వాత టెర్రస్ మీదకు ఎక్కి కిందకు దూకి చనిపోయింది.

`సినిమాల్లోనే అనుకున్నా.. బయట కూడా ఇలా ఆడుకుంటారా..` అంటూ ఓ యువతి చేసిన పని ఏంటంటే..

ఆ 20 ఏళ్ల యువతి తన చెల్లితో కలిసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.. బుధవారం సాయంత్రం కొద్ది సేపు చదువుకున్న తర్వాత టెర్రస్ మీదకు ఎక్కి కిందకు దూకి చనిపోయింది.. అంతకు ముందు ఆమె మణికట్టు మీద కోసుకుంది.. యాసిడ్ తాగేసింది.. అయినా చనిపోకపోవడంతో టెర్రస్ మీద నుంచి దూకేసింది.. ఆమె ఎందుకు చనిపోయిందనే కారణం ఇంకా బయటకు రాలేదు.. అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు సమీపంలోని బంగంగా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల రజినీ అనే యువతి తన చెల్లితో కలిసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇద్దరూ ఒకే గదిలో ఉండి చదువుకునేవారు. బుధవారం సాయంత్రం కొద్ది సేపు చదువుకున్న తర్వాత రజినీ టెర్రస్ పైకి వెళ్లి అక్కణ్నుంచి దూకి చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయిందో తెలియక కుటుంబ సభ్యులు షాకవుతున్నారు. ఆమెకు ఆరు నెలల క్రితం ఓ యువకుడితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. 


చనిపోయే ముందు రజినీ తన పుస్తకంలో సూసైడ్ నోట్ రాసింది. `ఇలాంటి ఆటలు సినిమాల్లోనే ఆడతారునుకున్నా. నిజ జీవితంలో కూడా ఇలా ఆడతారా? నా కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయకండి. నా మరణం వెనుక ఎవరి ప్రమేయమూ లేదు. ఆత్మహత్య చేసుకోవాలని నేనే నిర్ణయించుకున్నాన`ని రజినీ తన పుస్తకంలో రాసింది. పలు ఆత్మహత్యా ప్రయత్నాలు తర్వాత టెర్రస్ మీద నుంచి రజినీ కిందకు దూకేసింది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 


Updated Date - 2022-03-18T20:32:15+05:30 IST